Posts

Showing posts with the label మన యువత

మొగిలిపేట గ్రామం లో శుద్ధ జల పరిశ్రమతో ఉపాది పొందుతున్న యువకులు.

Image
మన గ్రామం లో ఇదివరలో శుద్దజల కేంద్రం లేకుండేది ... కాని రెండేళ్ళ క్రితం మన గ్రామం లోని కొందరు యువకులు దీనిని ప్రారంభించి ఉపాదిని పొందుతున్నారు . సంతోషం. పాత గ్రామ పంచాయతి భవనం లో కేంద్రం మరియు నిర్వాహకుడు గొల్లవత్తుల విజయ్ . రవాణ కోసం సిద్దం గా ఉన్న వాహనం .

నవ శాస్త్రి యువజన సంఘం

Image
   నేపథ్యం                      1970  దశకం లో మన ఊర్లో అంటే దొరలున్న జమాన్లో దాదాపు ఏ సంఘాలు లేవు కాని అప్పిటికి కాస్తో కూస్తో విద్యావంతులుగా ఉన్న గోల్కొండ సీతారాం, శ్రీ పెరంబుదూరి విద్యాసాగర్, చట్లపెల్లి చిన్ననర్సయ్య - పెద్ద నర్సయ్యలు, ద్యావతి ముత్తన్న, టెక్స్ నర్సయ్య , అంకతి పెద్దరాజన్న మొదలగు వాళ్ళు వాళ్ళ అవగాహన మేరకు "శాస్త్రి యువజన సంఘం " పేరు తో యువజన సంఘాన్ని ఏర్పరచుకున్నారు. ఆ సంఘం ద్వారా గ్రామం లో అభివృద్ధి మరియు సేవా కార్యక్రమాలు చేయాలని సంకల్పించారు. ఒక నిబద్దతతో క్రమశిక్షణతో వారు సంఘాన్ని నడిపారు. ప్రతీ మాసం క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించుకుని గ్రామ పరిస్థుతుల గురించి ఆలోచించేవారు . ప్రజల్లో అవగాహన పెంచేదానికి చిన్న చిన్న నాటికలను వేసేవారు. స్వయంగా విద్యాసాగర్ గారు రచయిత కళాకారుడు అవడం చేత నాటకాలు రచించి దర్శకత్వ భాద్యతలను నిర్వహించే వారు. అలా వారు వేసిన " తాగు బోతు " అనే నాటికను ఇప్పటికి మన గ్రామస్తులు యాజ్జేసుకుంటారు .  ఆ నాటిక లో తాగడం వల్ల అనర్ధాలను తెలియజెప్పారు.     ...