పసుపు కొమ్ము ను ఉడకబెట్టడం కోసం ఈ సీజన్ లో కొత్త యంత్రాలు వచ్చాయి - రైతులకు శ్రమ తగ్గింది.
పసుపు సాగు చేస్తున్న ప్రధాన ప్రాంతాల్లో కరీంనగర్ ,నిజామాబాద్ లు ముఖ్యమైనవి. సంప్రదాయ పద్దతుల్లో పసుపును పెద్ద పెద్ద "కడాయిల్లో " పెద్ద గోతులు తవ్వి ఉడకబెడుతుంటారు. ఈ సీజన్ లో ఊరికి నాలుగు ఐదు చొప్పున పసుపు ఉడకబెట్టడానికి బాయిలర్లు వచ్చాయి. పూర్తిగా ఆవిరి తో ఉడికే పద్దతి కావడం వల్ల తక్కువ కట్టెల తోనే బోలెడు పసుపు ఉడుకుతోంది . రైతులు దాదాపు అందరూ ఈ యంత్ర్రాల ద్వారానే ఉడకేస్తున్నారు . తక్కువ పసుపు దిగుబడి వచ్చిన వాళ్ళు మాత్రం కడాయిల్లో ఉడకేస్తున్నారు . మొత్తానికి అవసరాలు , కాలం తో పాటు మార్పు కళ్ళ ముందే అగుపిస్తోంది....... క్రింద వీడియోలో ఉడకబెట్టే యంత్రాన్ని చూడవచ్చు .