Posts

Showing posts with the label మన బడి

మొగిలిపేట లో గత కొన్నేళ్లుగా అనేక రూపాల్లో ఉపయోగపడుతున్న పాత తరం భవంతి

Image
                మా ఎరుక నుండి మొదలు ఈ భవంతి ముందుగా గ్రామ తపాల కార్యాలయం గా ఉండేది . అది బహూశా 1980  ప్రాంతం లో , అనంతరం పాతశాలకు తగిన వసతి లేని కారణంగా ప్రాథమిక పాటశాలను ఇందులోకి మార్చారు . ఆ తరువాత పాటశాలకు ఇప్పుడున్న శాశ్వత భవనం చేకూరడం తో ఈ భవనం ఖాళీ అయ్యింది .       ప్రస్తుతం వయోజన నిరంతర విద్యా కేంద్రం గా ఉపయోగ పడుతోంది . పాత తరం భవనాల్లో మిగిలిఉన్న ఏకైక భవనం ఇదొక్కటే కావడం విశేషం .  

మొగిలిపేట ఉన్నత పాటశాల లో ఘనంగా స్వయంపరిపాలనా దినోత్సవం

Image
మొగిలిపేట ఉన్నత పాటశాలలో విద్యార్థులు నవంబర్ 14 న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని "స్వయంపరిపాలనా " దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు .

మొగిలిపేట స్కూల్ లో బాలల దినోత్సవం - పిల్లల స్వయం పరిపాలన కార్యక్రమం.

Image
                       మొగిలిపేట ఉన్నత పాఠశాల లో బాలల దినోత్సవం సందర్భంగా స్వయం పరిపాలన వేడుక నిర్వహించారు. పిల్లలు ఉదయాన్నే చక్కగా తయారై వచ్చి ఒక్క రోజు మాస్టారి గా ఎనలేని ఆనందాన్ని ఆస్వాదించారు. పండగ చేసుకున్నారు. బహుమతులు అందుకున్నారు. జీవితం లో ఒక తీపి జ్ఞాపకాన్ని నమోదు చేసుకొన్నారు. కార్యక్రమ దృశ్య మాలిక : పిల్ల టీచర్ల స్టాఫ్ రూం .

మా బడి నుండి... గిజిగాడి పిట్టగూల్ల దగ్గరికి వెళ్లి పాఠ్యాంశాన్ని ప్రత్యక్షంగా భోదిస్తున్న శర్మగారు.

Image
                           మొగిలిపేట పాటశాల లో కేవలం సైన్స్ లే గాక భాషా విషయాలను కూడా ప్రత్యక్ష  సందర్శన గావించి, పిల్లలకు చక్కటి విషయ అనుభవాన్ని ఇస్తున్నమహేశ్వర శర్మ గారి ప్రయత్నం అభినందనీయం. దీని వల్ల పిల్లల్లో ఉత్సాహం, ఉల్లాసం తో పాటు మరిచిపోని రీతి లో గుర్తుంచుకొనే అవకాశం లభిస్తుంది. ఇలా వారు అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ప్రతీ వారాంతం లో ఏదేని కవి పరిచయం చేయడం జరుగుతోంది. చూడండి మా శర్మ గారి గిజిగాడి సందర్శన : అమ్మో  ఈ తుమ్మ కు ఎన్ని గూల్లో.... అంతా గిజిగాడి ఇంజనీరింగే మరి...! గుఱ్ఱం జాషువా గారి వర్ణన ను ప్రత్యక్షంగా పోల్చుకుంటున్న విద్యార్థులు . వివరణ లో లీనమైన శర్మ గారు. కేవలం గిజిగాడి గురించే కాదు, తుమ్మ చెట్ల వల్ల లాభం ... అలాగే తుమ్మ వల్ల పొలం కు మరియు రైతులకు గల లాభాలను వివరిస్తున్న శర్మ గారు. గోదావరి ఒడ్డున మా తెలుగు మాస్టారు..... శర్మ గారు.

విద్యార్థుల్లో జిజ్ఞాసను పెంచుతున్న మొగిలిపేట పాటశాల లోని వారాంత కార్యక్రమాలు.

Image
                             మొగిలిపేట పాటశాల లో గణితం సారు రామ్మోహన్ గారి ఆధ్వర్యం లో ప్రధానోపాద్యాయులు గోవర్ధన్ గారి సమక్షం లో  నియమితంగా  ప్రతి శనివారం విద్యార్థులలో జిజ్ఞాస, వ్యక్తిత్వ వికాసం ,భాషా జ్ఞానం, విజ్ఞాన విషయాలు, చిక్కు ప్రశ్నలు, పిల్లల నుండి సహజంగా నిత్యజీవితం లో అర్థం గాని ప్రశ్నల ను రాబట్టి  సమాధానాలతో కార్యక్రమమం యోజన చేసి అమలు చేయడం జరుగుతోంది. ఇది అత్యంత సహజంగా నిర్వహించడం విశేషం. పిల్లలు శనివారం ఎప్పుడొస్తుందా అనే రీతి లో సాగుతోంది. ఈ శనివారం విశేషాలు ( తేది : 23.10.2010 ) : పాటశాల ప్రాంగణం లో సమావేశమైన విద్యార్థులు. సి. నా . రె    కవి పరిచయం తో కార్యక్రమాన్ని  ప్రారంభిస్తున్న శర్మ గారు. ఆసక్తి గా వింటున్న విద్యార్థులు . ఉపాధ్యాయులు ...విద్యార్థులు . సైన్స్ సార్ జనార్ధన్ గారు  నీటి లో కొన్ని వస్తువులు మునుగుటకు, తేలుటకు గల కారణాలను కృత్యం ద్వారా తెలిపారు. అలాగే గణితం సార్  రాము గారు  సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమించడానికి గల ...

మొగిలిపేట పాటశాలలో పదవతరగతి పిల్లల తల్లిదండ్రుల తో ఉపాధ్యాయుల సమావేశం _ విశేషాలు.

Image
                         పాటశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ గోవర్ధన్ గారి ఆధ్వర్యం లో తేది : 25.10.2010 రోజున  పదవతరగతి పిల్లల తల్లి దండ్రుల తో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమం లో పిల్లల ప్రగతి మరియు రాబోవు ssc పరీక్షల కోసం తల్లి దండ్రులు పిల్లల పట్ల  తీసుకోవలసిన జాగ్రత్తలు  గురించి చర్చించడం జరిగింది. విషయాలు : పిల్లల ప్రగతి పత్రాలను తల్లిదండ్రుల తో కలసి విశ్లేషించడం జరిగింది. పిల్లలను ప్రతీ రోజు ప్రాతః కాలముననే లేపి చదివించాలని కోరడమైనది. ప్రతీ ఉపాధ్యాయుడు తన subject  కు సంబంధించి విద్యార్ధి మెరుగు కోసం సూచనలను చేశారు. త్రైమాసిక ఫలితాల పై విశ్లేషణ జరిగింది ... అనువర్తి గా చేపట్టాల్సిన చర్యలను చర్చించారు. పిల్లల లో చదువు తో పాటు సంస్కారాన్ని పెంపొందించుటకు తగు సూచనలను చేయడం జరిగింది. సమావేశానికి హాజరైన తల్లిదండ్రులు. సమావేశాన్ని ప్రారంభిస్తున్న తరగతి ఉపాధ్యాయులు  శర్మ గారు. వేదిక పై ఆసీనులైన ప్రధానోపాధ్యాయులు గోవర్ధన్ గారు , గ్రామ ప్రముఖులు వెంకట్రెడ్డి గారు  , ssc  పరీక్షల ఇంచార్...

మొగిలిపేట స్కూల్ లో బాలురకు వాలీబాల్ పోటీలు

Image
     మన మొగిలిపేట పాటశాల లో గత 15 వ ఆగస్ట్ సందర్భంగా  పిల్లలకు వాలీబాల్ పోటీలు జరిగాయి . ప్రారంభిస్తున్న హెడ్ మాస్టర్  శ్రీ గోవర్ధన్ గారు ..మరియు చిత్రం లో జనార్ధన్ , లచ్చుము , శర్మ గార్లు వున్నారు. సూచనలిస్తున్న శర్మ గారు ..! ఛలో మారో ...!

మొగిలిపేట స్కూల్ లో బాలబాలికలకు కబడ్డీ పోటీలు .

Image
                              గత 15 ఆగస్ట్ కోసం మన మొగిలిపేట్ ప్రభుత్వ ఉన్నత పాటశాలలో ఆటల పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా బాల బాలికలకు "కబడ్డీ "  ఆట ఆడించారు. కబడ్డీ - కబడ్డీ : కబడ్డీ టీం లతో సిద్దంగా వున్న  సార్లు శర్మ - లచ్చుము -శ్రీకాంత్ -జనార్ధన్ గార్లు. బాలుర కబడ్డీ షురూ .......! ఆడిస్తున్న తోట లింగన్న గారు....! ఛలో ..పట్టేయరా ...పట్టే య్ ...!  కబాడీ ....కబాడీ ...! టీంలకు సూచనలిస్తూ ..రామ్మోహన్ గారు. వీక్షిస్తున్న విద్యార్థులు . బాలికల కబడ్డీ ..షురూ ...! సూచనలిస్తున్న అరుణ మాడం గారు...! ఆడించడానికి సౌమ్య గారు విజిల్ తో  సిద్దం. ఛలో ..ఖేల్ షురూ ..! కబాడీ ...కబాడీ ...! పట్టే య్ ..పాయింట్ ..కొట్టెయ్ ...! వీక్షిస్తున్న విద్యార్థులు ...!

మట్టి గణపతి కి జై ...!

Image
                      ఎక్కడ చూసినా ప్లాస్టిక్ ... తో నరకాన్ని అనుభవిస్తున్నాం . అందులో మరీ ఈ  POP విగ్రహాలతో ఎంత కలుషితమో చెప్పవలసిన అవసరం లేదు . నాటి రోజుల్లాగే మన ఇంట్లో మన పాటశాలల్లో మట్టి విగ్రహాల తయారి ప్రారంభిద్దాం ... పంచి పెడదాం ..రండి.                                 మట్టి విగ్రహాలు పంచుతున్న మా విద్యార్థులు. మట్టి గణపతి కి జై ! మా బ్లాగ్ సందర్శకులందరికి చవితి శుభాకాంక్షలు .  

మన స్కూల్ వనమహోత్సవ విశేషాలు

Image
మన మొగిలిపేట  గ్రామ పాటశాలలో 16-7-2010 రోజున వనమహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటడం జరిగింది. ఆ కార్యక్రమ విశేషాలు దృశ్య రూపంలో మన గ్రామస్థుల మరియు మన శ్రేయోభిలాషుల కోసం ....  మొక్కలు నాటడం ప్రారంభిస్తున్న ప్రధానోపాధ్యాయులు గోవర్ధన్ గారు.  ఈ క్రింద మన పాటశాల ఫోటోలు చూడవచ్చు.