మొగిలిపేట పాటశాలలో పదవతరగతి పిల్లల తల్లిదండ్రుల తో ఉపాధ్యాయుల సమావేశం _ విశేషాలు.
పాటశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ గోవర్ధన్ గారి ఆధ్వర్యం లో తేది : 25.10.2010 రోజున పదవతరగతి పిల్లల తల్లి దండ్రుల తో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమం లో పిల్లల ప్రగతి మరియు రాబోవు ssc పరీక్షల కోసం తల్లి దండ్రులు పిల్లల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి చర్చించడం జరిగింది.
విషయాలు :
విషయాలు :
- పిల్లల ప్రగతి పత్రాలను తల్లిదండ్రుల తో కలసి విశ్లేషించడం జరిగింది.
- పిల్లలను ప్రతీ రోజు ప్రాతః కాలముననే లేపి చదివించాలని కోరడమైనది.
- ప్రతీ ఉపాధ్యాయుడు తన subject కు సంబంధించి విద్యార్ధి మెరుగు కోసం సూచనలను చేశారు.
- త్రైమాసిక ఫలితాల పై విశ్లేషణ జరిగింది ... అనువర్తి గా చేపట్టాల్సిన చర్యలను చర్చించారు.
- పిల్లల లో చదువు తో పాటు సంస్కారాన్ని పెంపొందించుటకు తగు సూచనలను చేయడం జరిగింది.
సమావేశానికి హాజరైన తల్లిదండ్రులు.
సమావేశాన్ని ప్రారంభిస్తున్న తరగతి ఉపాధ్యాయులు శర్మ గారు. వేదిక పై ఆసీనులైన ప్రధానోపాధ్యాయులు గోవర్ధన్ గారు , గ్రామ ప్రముఖులు వెంకట్రెడ్డి గారు , ssc పరీక్షల ఇంచార్జ్ లింగన్న గారు.
Comments
Post a Comment