ఎండి నిండిన మన చెఱువు ... బ్రతికిపోయాం !
మొత్తం నీటిని మన పెద్దమనుషులు వృధాగా వదిలేసిన కారణంగా గత వేసవి లో తీవ్ర నీటి ఎద్దడి ని ఎదుర్కున్నాం .
చెరువు మొత్తం ఎండి ఎండి ఊరి భూగర్భ నీటి మట్టాన్ని ప్రభావితం చేయడం తో జనం నీటి కోసం మన గ్రామ చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా పరుగులు పెట్టారు.లక్షలాది డబ్బు ఖర్చు తో బోర్లు వేయాల్సి వచ్చింది. నీటి విలువ ఏమిటో ఇప్పుడు అనుభవం లోకి వచ్చింది..
ఆ గంగమ్మ తల్లి కృప వల్ల మళ్లీ వానలు విస్తారంగా కురవడం తో చెరువు నిండా నీటి తో సింగారించుకుని వచ్చి పోయే వారికి కనువిందు చేస్తోంది. ఇక మనం చాలా చాలా జాగ్రత్తగా నీటి వినియోగం చేసుకోవాల్సి వుంది.
ఇంకా నీరు చెరువు లోకి చేరుతూనే వుంది.
Comments
Post a Comment